ఆడపిల్లల తల్లీదండ్రులకు 2 లక్షల రూపాయలు.. ఆ ప్రభుత్వం ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!

ఆడపిల్లల కోసం వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడపిల్లలు పుడితే రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలను సైతం అందిస్తుండటం గమనార్హం. అయితే ఆడపిల్లల తల్లీదండ్రులకు ప్రయోజనం చేకూరేలా ఒక స్కీమ్ అమలవుతోంది. ఈ స్కీమ్ పేరు భాగ్యలక్ష్మి స్కీమ్ కాగా ఆడపిల్లల తల్లీదండ్రులు ఈ స్కీమ్ ద్వారా ఎంతో బెనిఫిట్ పొందవచ్చు.

ఆడపిల్లల భ్రూణహత్యలను అరికట్టాలనే ఆలోచనతో ఈ స్కీమ్ అమలవుతుండగా ఈ స్కీమ్ బిడ్డ పుట్టిన తర్వాత పేరెంట్స్ కోసం అమలు చేస్తున్న సబ్సిడీ స్కీమ్ కావడం గమనార్హం. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ను ఇతర రాష్ట్రాలలో సైతం అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పిల్లల భవిష్యత్తుకు ఈ స్కీమ్ ఎంతగానో మేలు చేసే అవకాశం ఉంటుంది.

ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 21 సంవత్సరాలు నిండిన ఆడపిల్ల 2 లక్షల రూపాయలు పొందవచ్చు. భారతీయ పౌరులు ఎవరైతే 2 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తంలో ఆదాయాన్ని కలిగి ఉంటారో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇతర ధృవీకరణ పత్రాలు అందించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

2006 సంవత్సరం మార్చి 31వ తేదీ తర్వాత పుట్టిన ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. ఆడపిల్ల పుట్టిన తర్వాత రూ. 19,300/ డిపాజిట్ చేస్తారు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత 1,00,097 రూపాయలు అందజేస్తారు. రెండో ఆడపిల్ల పుట్టిన సమయంలో 18,350 రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు రెండో ఆడపిల్లకు 1,00,052 రూపాయలు అందజేస్తారు.