పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. పది, ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్లు ఈ నెల 23వ తేదీన కర్నూలు జిల్లాలోని ఉపాధి కల్పన కార్యాలయంలో జరుగుతున్న మెగా జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి దీప్తి మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ఐదు ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననుండగా ఈ జాబ్ మేళాకు హాజరైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు గరిష్టంగా 30 వేల రూపాయల వరకు వేతనం లభించనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఉదయం 9 గంటల నుంచి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది.

రెజ్యూమ్, సర్టిఫికెట్ల జిరాక్స్ లు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. 83092 83980 నంబర్ ద్వారా ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. జాబ్ మేళాకు హాజరు కావడం ద్వారా సులువుగా జాబ్ కు ఎంపికయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్లు ఈ జాబ్ మేళాపై దృష్టి పెడితే మంచిది.

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సోషల్ మీడియా పేజీల ద్వారా ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది.