‘సాహో’కి ఆ డిజాస్టర్ సినిమాతో పోలికా?

‘సాహో’కి ఆ డిజాస్టర్ సినిమాతో పోలికా?

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’.ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఇప్పుడు ఈ సినిమాపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి.

రామ్ చరణ్ డిజాస్టర్ చిత్రం జంజీర్ (తెలుగులో తుఫాన్)తో ఈ సినిమాని పోలుస్తున్నారు. అందుకు కారణం రామ్ చరణ్ తెలుగు హీరో అయినా హిందీలో సినిమా నిర్మించి,అక్కడ హీరోయిన్,మిగతా ఆర్టిస్ట్ లను పెట్టి , తెలుగులో డబ్ చేసారు. ఇప్పుడు సాహోకు అదే పని నిర్మాతలు చేస్తున్నారంటున్నారు. హిందీ మార్కెట్ కోసమే నిర్మాతలు ఇలా చేస్తున్నా తెలుగు మార్కెట్ లో ఈ సినిమా దెబ్బ తింటుందని అభిమానులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఇలా అంతా అనుకోవటానికి కారణం ..ఈ చిత్రంలోని తొలి పాట రీసెంట్ గా విడుదల చేసారు. ‘సైకో సయ్యాన్‌.. ’ అంటూ సాగే ఈ పాట ప్రభాస్ అభిమానులను నిరాశపరచిందనేది నిజం. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చి స్వరపరిచిన ఈ పాట బీట్ బావున్నా లిరిక్స్ మాత్రం పూర్తిగా దెబ్బకొట్టాయి.

అందుకు కారణం ఈ పాటకు మొదట హిందీ లిరిక్స్ రాసి దానికి ట్యూన్ కట్టడమే. ఆ తరువాత తెలుగు రైటర్ శ్రీజో ఆ ట్యూన్ కి లిరిక్స్ రాసి మార్కెట్లో కు వదిలారు. సాధారణంగా వేరే లాంగ్వేజ్ చిత్రాలు తెలుగులోకి డబ్బింగ్ చేసినప్పుడు అటువంటివి చేస్తారు. అయితే ట్యూన్ కి తగ్గ లిరిక్స్ రాయడం శ్రీజో చేయలేకపోయారు. దానితో తెలుగు పాట లా కాకుండా ఏదో హిందీ పాట వింటున్న ఫీల్ వచ్చింది.

దానికి తోడు పాటలో … ప్రభాస్ కూడా నీరసంగా కనిపించాడు… పాట బీట్ కు తగ్గట్టు ఆయన జోష్ లేకపోవటం ఫ్యాన్స్ ని నిరాశపరచింది. పాటలో శ్రద్ధా కపూర్ డాన్స్ ఇరగకొట్టింది. కానీ ప్రభాస్ తో చిన్న చిన్న స్టెప్స్ వేయించి పనికానిచ్చేశారు.

ఇక ఈ చిత్రంలో నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతోంది.