అనుష్క,ప్రభాస్ లపై మళ్లీ అవే రూమర్సా,నిజం తెలుసుకోండి

 

అనుష్క,ప్రభాస్ లపై మళ్లీ అవే రూమర్సా,నిజం తెలుసుకోండి

ఒక వైపున ప్రభాస్ ‘సాహో’ సినిమా పనులతో .. మరో వైపున అనుష్క ‘సైలెన్స్’ సినిమా షూటింగులో బిజీగా వున్న సంగతి తెలిసిందే. త్వరలో వీళ్లిద్దరూ ‘లండన్’ వెళ్లనున్నారు. ఈ విషయమై రకరకాల రూమర్స్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వీళ్లిద్దరూ కలిసి లండన్ ట్రిప్ వెళ్లనున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ రకరకాలుగా ఊహిస్తున్నా అసలు నిజం వేరే ఉంది.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సిరీస్ అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.దాంతో అటు ప్రభాస్, అనుష్కకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తెలుగు సినీచరిత్రలో భారీ సక్సెస్‌ఫుల్ మూవీగా పేరుగాంచిన ‘బాహుబలి’ చిత్రం త్వరలోనే లండన్‌లో ప్రదర్శించబోతున్నారు. ఈ షో కోసం చిత్ర యూనిట్ లండన్ పయనం కాబోతున్నారని తెలుస్తోంది. లండన్‌లోని ప్రముఖ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘బాహుబలి 2’ సినిమాను అక్టోబర్‌లో ప్రదర్శించనున్నారు.ప్రతి సంవత్సరం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ సినిమాలను ఈ హాల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ ఏడాది బాహుబలి 2 సినిమాకు ఆ ఛాన్స్ దక్కింది.

<

p style=”text-align: justify”>ఎలిజబెత్ రాణి కుటుంబ సభ్యులతో పాటు లండన్ లోని వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు ఈ ప్రదర్శనకి హాజరవుతారు. ఈ ఏడాది ప్రదర్శితమయ్యే సినిమాల్లో ‘బాహుబలి 2’ సినిమాకి చోటు దొరికింది. సినిమాను ప్రదర్శించిన అనంతరం అక్కడి ప్రముఖులతో ఆ సినిమా టీమ్ ముఖాముఖి వుంటుందట. అందువలన లండన్ లో అక్టోబర్లో జరిగే ‘బాహుబలి 2’ ప్రదర్శనకి రాజమౌళి .. ప్రభాస్ .. అనుష్క .. రానా .. కీరవాణి వెళ్లనున్నారని సమాచారం.