సాయిధరమ్ తేజ్ తమ్ముడైన మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవ్వబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.
కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు, నీహారిక, అల్లు అర్జున్ ఇలా మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యింది. అయితే పవర్స్టార్ పవన్ కల్యాణ్, మెగాపవర్స్టార్ రామ్ చరణ్ ఈ ఈవెంట్లో కనిపించలేదు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తాడని అంచనా వేసారు. పవన్ డుమ్మా కొట్టడానికి కారణమేంటి? అని ఆరాతీస్తే …. పవన్ తీసుకున్న నిర్ణయమే ఈ ఈవెంట్ కు రాకుండా ఆపింది అంటున్నారు. ఇంతకీ ఏమిటా నిర్ణయం అంటే… తను సీరియస్ పొలిటిషన్ గా ఉండాలంటే సినిమా పంక్షన్స్ ని, సినిమాలని దూరం పెట్టాలని అప్పుడే ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడుగా తనను పరిగణిస్తారని పవన్ భావిస్తున్నారట. ఈ విషయమై తన సన్నిహితులతో మాట్లాడి…కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ఈ ప్రారంభోత్సవానికి రాలేదని తెలుస్తోంది.
మరోవైపు రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో బిజీ బిజీ. అందువల్ల ఆ ఇద్దరూ రాలేకపోయారు.ఇక వీళ్లద్దరు రాలేదనే లోటు లేకుండా ఈవెంట్ నడిపించాలనే ఆ బాధ్యత మొత్తం మెగాస్టార్ చిరంజీవి- బాస్ అల్లు అరవింద్ తీసుకున్నారు. దగ్గరుండి కథంతా నడిపించారు. ఇక తన అభిమాన మేనల్లుడికి జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే బ్లెస్సింగ్స్ అందించారు.