‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’: తప్పుకున్న హీరోయిన్, ఎన్టీఆర్ పైనే నెపం

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో హీరోల పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాతోపాటు డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ మరో హీరోయిన్ అని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు నుంచి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా డైసీ జోన్స్ ప్రకటించింది.

“దురదృష్టవశాత్తూ నా ఫ్యామిలీలో తలెత్తిన కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నేను ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాను. సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది. నిజంగా ఇదొక గొప్పపాత్ర. రాబోయే రోజుల్లో నా పాత్ర ఎవరు పోషించినా ఆమెకు కూడా అపూర్వ స్వాగతం దక్కుతుంది. యూనిట్ కు ఆల్ ది బెస్ట్.” అని చెప్పుకొచ్చింది. అయితే ఎందుకు ఆమె అలా ప్రకటించాల్సి వచ్చింది.

నిజంగానే ఆమెకు కుటుంబంలో సమస్యలు వచ్చాయా అని మీడియాలో రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ యాంటి ప్యాన్స్ …ఆమెకు ఎన్టీఆర్ ప్రక్కన చేయటం ఇష్టం లేదని, ఎన్టీఆర్ కొన్ని పాత సినిమాలు చూసి ఆ నిర్ణయానికి వచ్చిందంటూ నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు.

దానికి కౌంటర్ గా కొందరు ఫ్యాన్స్.. అదేం కాదు ఆమెకు హాలీవుడ్ లో ఇంతకు మించిన ఆఫర్ వచ్చిందని, అందుకే అటువైపు ఛూజ్ చేసుకుందని మరికొందరంటున్నారు. ఎవరు ఏమంటేనేం ఆమె తప్పుకుందనేది నిజం. ఇప్పుడు మరో విదేశి నటిని ఆ పాత్ర కోసం వెతకాల్సిన భాద్యత టీమ్ పై పడింది.

ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి… దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.