స్పెయిన్ లో నదియా-కీర్తీల మధ్య ఏం జరిగింది?

స్పెయిన్ లో నదియా-కీర్తీల మధ్య ఏం జరిగింది?

 
మహానటి ఫేమ్  బ్యూటీ  కీర్తి సురేష్ కెరీర్ లో అందనంత ఎత్తుకు ఎదిగిపోయేందుకు కసరత్తులు మొదలు పెట్టిందట.  చిత్రసీమలోకి  అడుగు పెట్టిన అతి తక్కువ కాలంలో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  ఊహించని విధంగా కెరీర్ మలుపులు తిరుగుతోంది. ఈ అదృష్టాన్ని ఇలాగే కాపాడుకొనే దిశగా పావులు కదుపుతోంది.
 
తాజాగా ఈ బ్యూటీ స్పెయిన్ లో చక్కర్లు కొడుతోంది. తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్ళిన కీర్తి షూటింగ్ తో పాటు అక్కడి  అందాలను తిలకిస్తూ హాయిగా సందడి చేస్తోందట.  కొత్త దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం కీర్తి ఈ నెలంతా స్పెయిన్ లోనే గడుపుతుందట. జూన్ మొదటి వారంలో ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్  నిరాటకంగా కొనసాగుతుంది. కీర్తి తన పాత్రని సమర్థవంతంగా పోషిస్తూ యూనిట్ అందర్నీ ఆకట్టుకుంటోదట. లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో తనకు నచ్చిన పాత్రలో పూర్తిగా లీనమై నటిస్తున్నదట. ఈ నెలాఖరుకు గానీ ఇండియా కు రాదని యూనిట్ వాళ్ళు చెప్పారు.  
 
స్పెయిన్ లో ఈ చిత్రం కోసం సీనియర్ నటి నదియా-కీర్తి సురేష్ లపై చిత్రీకరించిన కీలక  సన్నివేశాలు పోటాపోటీగా వచ్చాయని, దర్శకుడు ఈ విషయంలో ఎంతో సంతృప్తిగా ఉన్నాడని యూనిట్ చెప్పుకుంటున్నారు. నదియా పాత్ర చిత్రీకరణ మొత్తం పూర్తయ్యిందిట.  స్పెయిన్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టేనని తెలిసింది. విజయదశమి కానుకగా ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాత. మహానటి చిత్రం ఫేం డ్యానీ కెమెరామెన్ గా వ్యవహరి స్తున్నారు.
 
ఇదంతా బాగానే ఉంది. అయితే స్పెయిన్ లో కీర్తి- నదియా పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో వీళ్లిద్దరి మధ్య కొంతగొడవ జరిగిందట.  దర్శకుడు నరేంద్రనాథ్ ఈ విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరించి షూటింగ్ ని పూర్తి కానిచ్చాడట! ఇంతకీ  నదియా-కీర్తీల మధ్య  జరిగినదేమిటి?  వీళ్లిద్దరి మధ్య షూటింగ్ లో గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎవరూ నోరు విప్పడం లేదు!