‘అర్జున్ రెడ్డి’ డైరక్టర్ ఆ తప్పు మాత్రం చేయడట

హిట్ అయ్యిన సినిమాలకు సీక్వెల్ తీయటం అతి సామాన్యమైన విషయం. ఎందుకంటే బిజినెస్ పరంగా వాటికి మంచి క్రేజ్ ఉంటుంది. అయితే సీక్వెల్స్ తీసే ఆలోచన దర్శకులు చాలా మంది తాము వరస ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు తమ హిట్ సినిమాలను గుర్తు చేస్తూ చేస్తూంటారు. అయితే వాటిని జనం అప్పటికి మర్చిపోయింటారు. అయితే ఆ తప్పు సందీప్ వంగా చేయదలచుకోలేదని తెలుస్తోంది. తన తాజా చిత్రం అర్జున్ రెడ్డికు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నాడని అంటున్నారు. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ డేట్స్ దొరకాలనేదే కండీషన్.

అంతేకాదు అర్జున్ రెడ్డిని మించిన కథ దొరకాలి అని ప్రయత్నిస్తున్నాడట. ఈ విషయమై దర్శకుడు మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన చేస్తున్నాం కాకపోతే , యుక్త వయసు కాకుండా 40 ఏళ్ల వయసులో అర్జున్ రెడ్డి ఎల్ ఉంటాడు అన్నదాని మీద ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అంటూ చెప్పాడు . తెలుగునాట వచ్చిన సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడలేదు ఒక్క బాహుబలి మినహా . మరి అర్జున్ రెడ్డి పార్ట్ 2 సక్సెస్ అవుతుందా చూడాలంటోంది మీడియా.

మరో ప్రక్క సందీప్ వంగ మంచి జోష్ మీద ఉన్నారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన వెంటనే సందీప్ వంగా డైరెక్షన్‌లో నటించేందుకు రామ్ చరణ్, మహేష్ బాబు వంటి బడా హీరోలు ఆసక్తి చూపారు. అయితే వెంటనే డేట్స్ ఇవ్వలేదు. ఒక ఏడాది తర్వాత వర్క్ చేద్దామన్నారు. కానీ వంగా వెయిట్ చేయకుండా హిందీ రీమేక్ చేసి.. ఇప్పుడు బాలీవుడ్‌లో సెన్సేషనల్ డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమా వంద కోట్ల మార్క్ దాటుతుందని అంచనా.