సాయి తేజ ‘ప్రతిరోజు పండగే’ పాయింట్ ఇదే

రీసెంట్ గా మెగా హీరో సాయి తేజ్ కొత్త చిత్రం మొదలైన సంగతి తెలసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీకి ప్రతిరోజు పండగే అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రొమాంటిక్ కామెడీల చిత్రాల దర్శకుడు మారుతీ డైరెక్షన్‌లో మూవీ తెరకెక్కనుంది. తాజాగా చిత్రలహరి మూవీతో ఓ డీసెంట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు సాయిధరమ్ తేజ్. గీత ఆర్ట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ ఇన్వాల్స్ అయ్యి ఉన్న ఈ చిత్రం కథపై ఫిల్మ్ సర్కిల్స్ లో వివిధ కథనాలు వినపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ చిత్రం మూడు తరాల చుట్టూ తిరుగుతుంది. సాయి తేజ, తండ్రి రావు రమేష్, ఆయన తండ్రి సత్యరాజ్. ఇలా ముగ్గురి మధ్యా జరిగే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. రాశి ఖన్నా పాత్ర అయితే టిక్ టాక్ వీడియోలకు ఎడిక్ట్ అయ్యిన అమ్మాయి అని, సాయి తేజ ఆమె లైఫ్ లోకి వచ్చాక మిరాకిల్ జరిగినట్లు ఫీలవుతుందని చెప్తున్నారు. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో కథనం నడుస్తుందని, అందుకోసం ఓ విలేజ్ ని ఎంపిక చేసి అక్కడే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కుటుంబ కథా చిత్రమిది. చక్కటి వినోదం, హృదయాల్ని స్పృశించే భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. సాయిధరమ్‌తేజ్ పాత్ర చిత్రణ నవ్యపంథాలో సాగుతుంది అన్నారు. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ఇది. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు కీలకంగా ఉంటాయి. ఉన్నత విలువలతో తెరకెక్కిస్తున్నాం అని నిర్మాత తెలిపారు.

విజయకుమార్, రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్‌రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జైకుమార్ వసంత్, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు, సహనిర్మాత: ఎస్.కె.ఎన్, రచన-దర్శకత్వం: మారుతి దాసరి.