‘సాహో’ఫ్యాన్స్ కు ఆగస్ట్ 15 ట్రీట్,గెట్ రెడీ
యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సాహో’ సినిమా . యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15 విడుదల అనుకుంటే దాన్ని ఆగస్ట్ 30 కు వాయిదా వేసారు.
సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ, తరువాతి కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశాలు ఉండదడమే కారణంగా తెలుస్తోంది. గ్రాఫిక్స్ వర్క్స్ భారీగా ఉండటంవల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్లే ‘సాహో’ విడుదల వాయిదా పడిందని చెబుతున్నారు. వాయిదా విషయంలో నిరాశపడ్డ ఫ్యాన్స్ ను ఖుషీ చేయటానికి ఆగస్ట్ 15 న ఈ చిత్రం థియోటర్ ట్రైలర్ వదులుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
2017 జూన్ 9న ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభమైంది. భారతీయ అతిపెద్ద యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను పూర్తిచేయడానికి 25 నెలలు పట్టింది. సుజిత్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. ఇటీవల సినిమాలోని ‘సైకో సయ్యా’ అనే పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.