రాజమౌళి డెసిషన్… ఎన్టీఆర్, చరణ్ ఫుల్ పండగ

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో మొదలైన మొదటి షెడ్యూల్‌ ఇటీవల పూర్తైంది. ఈరోజు నుంచి రెండో భారీ షెడ్యూల్‌ను ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్‌మీడియా ద్వారా తెలియచేసాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బజ్జెట్ ఎంత పెట్టబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎంత కాలం ఈ ప్రాజెక్టుపై పనిచేయనున్నారు వంటి విషయాలు చర్చగా మారాయి.

అందుతున్న సమాచారం ప్రకారం డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే బాహుబలిలా ఈ సినిమాని ఎక్కువ కాలం షూట్ చేయకూడదని, సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం.

అందుకే ఈ చిత్రం కోసం రామ్ చరణ్‌, ఎన్టీఆర్ లను రాజమౌళి పది నెలలు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు వారు కూడా ఒప్పుకొన్నారని, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పూర్తయ్యేవరకు వేరే ఏ ఇతర సినిమా షూటింగ్ లను మొదలుపెట్టరని టాలీవుడ్‌ టాక్‌. ఇలా తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేసి రిలీజ్ కు పెడతాడని ఊహించని హీరోలిద్దరూ ఫుల్ పండుగ చేసుకుంటున్నారట.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ … వివరాలు, ఇతర నటీనటులకి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ భామ అదితి రావు హైదరిని ఓ హీరోయిన్ గా ఎంపికచేసుకోవాలని రాజమౌళి, టీమ్ భావిస్తున్నారట.

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.పార్వతి.