ఇలా చేసారేంటి ? `సాహో` టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్

సాహో టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లాస్ట్ స్టేజ్ కు చేరుకున్నాయి. రిలీజ్ టైమ్ కరెక్ట్ గా నెల మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ పై టీమ్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఇందుకోసం మొత్తం యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ ప్రమోషన్స్ ఓ మూలకు రావటం లేదని ప్రభాస్ కంప్లైంట్ అని తెలుస్తోంది.

బాహుబలి ప్రమోషన్స్ తో దేశం మొత్తం రిలీజ్ కు ముందు ఊగిపోయిన దాంట్లో సగం కూడా ఇప్పుడు ఉండటంలేదని ప్రభాస్ వాపోతున్నాడట. ఈ మేరకు టీమ్ తో ఎన్ని సార్లు మాట్లాడినా ఫలితం ఉండటం లేదట. ముంబై కు సంభందించిన పీఆర్ ఏజెన్సీ వాళ్లు ఈ చిత్రం నార్క్ ప్రమోషన్ తీసుకుని అక్కడ హాట్ కేకులా మార్చారు. తెలుగులో పరిస్దితి రివర్స్ లో ఉంది. దాంతో టైమ్ పెద్దగా లేదు. ఏం చేయాలా అని ప్రభాస్ తలపట్టుకు కూర్చున్నాడట.

దాంతో సాధారణంగా సినిమా ప్రమోషన్స్ అంటే అతి తక్కువగానే పార్టిసిపేట్ చేసే ప్రభాస్ ఈసారి తన స్టైల్ మార్చుకుని రంగంలోకి దూకపోతున్నాడు. భారీ ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారట ప్రభాస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఎలాగూ జరుగుతాయి. కానీ ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రభాస్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట. రిలీజ్ నాలుగు వారాలు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ఎలా చేయాలనే దానిపై ప్రణాళికలు వేస్తున్నారట ప్రభాస్ పీఆర్ టీమ్.

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ నటించిన ఈ చిత్రంలో నీల్ నితిన్, చంకీ పాండే, మందిరాబేడి, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 30న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.