‘గీత గోవిందం’ డైరక్టర్ ఆ హీరో డేట్స్ కోసం వెయిటింగ్

విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే. దాంతో ఆ చిత్ర దర్శకుడు పరుశరామ్ ..స్టార్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిపోయారు. దాంతో ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలు,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ పరుశరామ్ మాత్రం గీతా ఆర్ట్స్ లోనే ఉండిపోయారు. అక్కడే మరో సినిమా చేద్దామని ఆగిపోయారు.

వాస్తవానికి పరుశరామ్ కు బయిట నిర్మాతల నుంచి భారీ ఆఫర్సే వచ్చాయిట. రెమ్యునేషన్ పరంగా కూడా గీతా ఆర్ట్స్ వారు ఇస్తానని ఆఫర్ చేసే ఎమౌంట్ కు రెట్టింపు ఉందిట. కానీ తను గాడ్ ఫాధర్ గా భావించే అల్లు అరవింద్ మాట ప్రకారం మరో సినిమా గీతా ఆర్ట్స్ లో చేయాలని పరుశరామ్ ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే తను ఫ్లాఫ్ ల్లో ఉన్నప్పుడు చేరదీసి శ్రీరస్తు ..శుభమస్తు చిత్రం ఇచ్చి నిలబెట్టారు. ఆ తర్వా విజయ్ దేవరకొండ డేట్స్ తెచ్చి ..సినిమా చేయించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ గీసిన గీత దాటకూడదనే ఫిక్స్ అయ్యాడట.

మరి ఇప్పుడు పరుశరామ్ తో చేసే తదుపరి హీరో ఎవరు ..అల్లు అరవింద్ ఎవరిని సెట్ చేయబోతున్నారనేది పెద్ద క్వచ్చిన్. అయితే పరుశరామ్ దృష్టి మొత్తం అల్లు అర్జున్ మీదే ఉందిట. కానీ అల్లు అర్జున్ చూద్దాం..మంచి కథ తీసుకురండి అని చెప్పారట. దాంతో పరుశరామ్ ఆ పనిలో ఉన్నారట. తన టీమ్ తో కలిసి స్రిప్టు డిస్కషన్స్ లో ఉంటున్నారని సమాచారం. అల్లు అర్జున్ కనుక ఓకే చేస్తే పెద్ద లీగ్ లో పడిపోతాడు పరుశరామ్.