‘ఆర్ ఆర్ ఆర్’ : హీరోయిన్ తల్లికి కేన్సర్, తలపట్టుకున్న టీమ్

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ఆర్. కొద్ది రోజుల క్రిందటి వరకూ కంటిన్యూగా సాగిన షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వడంతో ఎన్టీఆర్, చరణ్ రెస్ట్ లో ఉన్నారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేస్తున్నాడు జక్కన్న.అయితే టీమ్ ని ఓ సమస్య వేధిస్తోంది. రామ్ చరణ్‌కు జోడీగా ఆలియాభట్ చేస్తుంటే, ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఖరారు లేదు. అయితే, ఎన్టీఆర్‌ను అమితంగా ప్రేమించే గిరిజన యువతి మాత్రం తరువాతి షెడ్యూల్ షూట్‌కు రెడీ అవుతోందట. ఆమె ఎవరో కాదు -నిత్యమీనన్.

ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులోకి తాజాగా నిత్యమీనన్ ఎంటరైనట్టు టాక్ ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది. ఎన్టీఆర్ ప్రాణప్రదంగా ప్రేమించే గిరిజన యువతిగా ఆమె కనిపించనుందని వినికిడి. నిత్యమీనన్ చేస్తోందంటే ఆ పాత్రకున్న ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. నిత్య పాత్ర ఆడియన్స్‌కు బాగా కనెక్టవుతుందని టీమ్ అంటోంది. అయితే ఇప్పుడు నిత్యామీనన్ వైపు నుంచి సమస్య వచ్చి పడిందిట. ఆమె షూటింగ్ కు రాలేని పరిస్దితి వచ్చిందంటున్నారు. ఇప్పటికే ఆమె తను ఒప్పుకున్న తమిళ, మళయాళ చిత్రాల ప్రాజెక్టుల షూటింగ్ లకు వెళ్లటం లేదు.

త‌న త‌ల్లికి క్యాన్స‌ర్ కార‌ణంగానే షూటింగ్ ల‌కు ఆమె హాజ‌రు కాలేక‌పోతున్నానని చెప్పింది. తన తల్లికి కాన్సర్ థర్డ్ స్టేజిలో ఉందని తెలిసిందని, దాంతో ఆమెను ఓదార్చటం, తనను తాను సమాధాన పడటం కాస్త కష్టంగా అయ్యిపోతోందని అంది. తాను ఆ బాధతో ఏడుస్తూంటే మైగ్రైన్ పెయిన్ వస్తోందని, దాంతో తాను స‌మాచారం కూడా ఇచ్చే ప‌రిస్థితుల్లో లేన‌ని చెప్తోంది. దాంతో ఈ షెడ్యూల్ కూడా అప్ సెట్ అవుతుందా అని రాజమౌళి టీమ్ తల పట్టుకుంది అంటున్నారు.