నిజమైతే ..నిహారిక ఫ్యాన్స్ కు ఇది బాధకలిగించే వార్తే!?

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ప‌రిచ‌యం అయ్యారు, స‌క్సెస్ అయ్యారు.అవుతున్నారు. కానీ న‌టిగా ప‌రిచ‌య‌మైన ఈ అమ్మాయి స‌క్సెస్ కాలేక‌పోతోంది హీరోయిన్‌గా. నాగబాబు కుమార్తె నీహారిక బుల్లితెర‌పై, వెబ్‌ సీరిస్ లలోనూ స‌క్సెస్ అయింది. కానీ వెండితెర‌పై ఆమెకి ల‌క్ అసలు క‌లిసిరావ‌డం లేదు. టీవీ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆమెకు… “ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ” అనే పేరుతో యూట్యూబ్‌, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తే… యూత్‌ బాగా చూసింది.

కానీ దురదృష్టమేంటో కానీ…హీరోయిన్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన ఏ మూవీ కూడా ఆడలేదు.. అయినా నిరాశ‌చెంద‌డం లేదు. ప‌ట్టువ‌ద‌లకుండా ప్రయత్నాలు చేసింది . రీసెంట్ గా “ముద్దప‌ప్పు” వెబ్ సిరీస్ ద‌ర్శ‌కుడు ప్రనీత్ తీస్తున్న తొలి చిత్రంలోనూ న‌టించింది. నిర్వాణ సినిమాస్ అనే ఓవ‌ర్సీస్ కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌లో రూపొంజదిన ఈ సినిమాలో రాహుల్ విజయ్ హీరో. “సూర్య‌కాంతం” అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమా కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఇంట్లోవాళ్లు ఆమెకు సంభందాలు చూడాలని ఫిక్సై అయ్యారని వార్తలు వస్తున్నాయి.

వివాహం చేసుకుని వెండి తెరకు బై చెప్తుందంటున్నారు. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవని,కొత్త సినిమాలు కూడా కమిట్ కావటం లేదని చెప్తున్నారు. సుకుమార్ రైటింగ్ లో తమ బ్యానర్ లో ఆమెతో ఓ సినిమా అనుకున్నా..నాగబాబు మాత్రం పెళ్లి చేసి పంపేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. సినిమాలు ఆడినా ఆడకపోయినా నీహారిక మంచి నటిగా ప్రూవ్ అయ్యింది. ఆమెకంటూ సొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. అలాంటి పరిస్దితుల్లో పెళ్లి చేసుకుని వెండి తెరకు దూరం అవటం అనేది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని విషయమే. అయితే వివాహానంతరం కూడా నటించవచ్చు కదా అంటున్నారు.