‘సాహో’ లో మహేష్ హీరోయిన్ ఐటం సాంగ్

ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజిత్‌ దర్శకుడు. వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మాతలు. యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాకు రోజుకో విశేషం యాడ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ చేత ఐటం సాంగ్ చేయిస్తున్నారని సమాచారం. ఆ హీరోయిన్ మరెవరో కాదు కైరా అద్వాని అని తెలుస్తోంది. ”భరత్ అనే నేను” సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించిన కైరా అద్వానీకు తెలుగునాట మంచి క్రేజ్ వచ్చింది. మొదట రష్మిక ని ఐటం సాంగ్ కోసం అడిగితే రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. అలాగే ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయిల్ రాజ్ పుత్ సైతం ఈ పాట కోసం అడిగారని చెప్పుకున్నారు. కానీ ఆమె కొట్టిపారేసింది.

‘సాహో’ ప్రారంభంలో మొదట స్పెషల్ సాంగ్ ఆలోచన కూడా లేదు. కానీ అనుకోకుండా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఫిక్సయిన ఫిల్మ్ మేకర్స్, ఈ సాంగ్ కోసం స్పెషల్ గా సిచ్యువేషన్ క్రియేట్ చేసి మరీ ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కాన్సంట్రేషన్ ‘సాహో’ సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేయనున్న ఈ స్పెషల్ సాంగ్ పై మళ్ళింది.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ ప్రతి సీన్‌ని ఎలివేట్‌ చేసే విధంగా జిబ్రాన్‌ వరల్డ్‌ క్లాస్‌ క్వాలిటీ రీ రికార్డింగ్‌ అందిస్తున్నారు. చిత్రాన్ని స్వాతంత్య్రదినోత్సవం కానుకగా అగస్ట్‌ 15 న విడుదల చేస్తాం. తెలుగు, తమిళ, హిందీలో ఏకకాలంలో రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్‌: సాబు సిరిల్‌, ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌