రజనీకి జోడిగా ఆమెనా?…ఎలా ఒప్పించారు?

తన వయస్సుకు తగినట్లే తెరమీద కనిపించటానికి ఇష్టపడుతున్నారు రజనీ. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఆయన సీనియర్స్ నే ఎంచుకుంటున్నారు. లేకపోతే మనవరాలు తో నటించారంటూ కామెంట్స్ వస్తాయని జాగ్రత్తలు పడుతున్నారు. అందుకే అనుష్క, హ్యూమ ఖురేషి సిమ్రాన్, ఈశ్వరి రావు వంటి నటీమణులకు తన సరసన నటించటానికి అవకాసం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయన సరసన కీర్తి సురేష్ నటించబోతున్నట్లు తమిళ సినీ వర్గాల సమాచారం.

మురగదాస్, రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రంలో కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఓకే చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే 68 సంవత్సరాల రజనీ సరసన కీర్తి సురేష్ అంటే కొత్తగా ఇబ్బందిగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే మురగదాస్ మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఈ సినిమాలో రజనీలుక్ ..యంగ్ హీరోలను తలదన్నేలా ఉంటుందని ఆయన చెప్తున్నారట. ఆ కోణంలోనే రజనీని ఒప్పించారట.

అయితే మరికొంతమంది చెప్పేదాని ప్రకారం…కీర్తి సురేష్ పాత్ర …రజనీకు జోడి కాదని, ఓ కీలకమైన పాత్ర అని అంటున్నారు. ఏది నిజం ..అని తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సిందే.

మరో ప్రక్క సినిమాలు చేయడంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పీడును రెట్టింపు చేసారు. ఓ సినిమా పూర్తి కాకుండానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రజనీ కాంత్ ప్రస్తుతం ‘పెట్టా’లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో సామాజిక కథలను తెరకెక్కించి కమర్షియల్ హిట్‌లు కొట్టడంలో సిద్ధహస్తుడైన మురగదాస్‌ దర్శకత్వంలో నటించేందుకు రజనీ ఓకే చెప్పారు.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేయనున్నట్లు కూడా సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.