ఎన్టీఆర్ అనూహ్య నిర్ణయం..షాకైన ఫ్యాన్స్

స్టార్ హీరోల పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు పండగే. తమ పుట్టిన రోజులు కూడా జరుపుకోని వాళ్లు కూడా తమ అభిమాన హీరో పుట్టిన రోజుని ఘనంగా జరుపుతూంటారు. మరీ ముఖ్యంగా తమిళ, తెలుగు హీరోల ఫ్యాన్స్ ఆ విషయంలో ఓ అడుగు ముందే ఉంటారు. ఆ రోజు రచ్చ రచ్చ చేస్తూంటారు. అయితే ఎప్పటిలాగే ఎన్టీఆర్ అభిమానులు సైతం తమ హీరో పుట్టిన రోజుని ఘనంగా జరపాలని డిసైడ్ ఏర్పాట్లు మొదలెట్టారు. అయితే ఈ సారి జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం తన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

వివరాల్లోకి వెళితే..ఈ నెల మే 20 జూనియర్ పుట్టిన రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం అనేక చోట్ల అన్నదానం, రక్త దాన శిబిరాల ఏర్పాటుతో పాటు వివధ రకాల సామజిక సేవ కార్యక్రమాల నిర్వహణ కు ఏర్పాట్లు మొదలుపెట్టారు.

కానీ ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ తీసుకొన్న నిర్ణయం వారి ఆశలు నీళ్లు జల్లినట్లు అయ్యింది. ఎన్టీఆర్ తండ్రి హరి కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాక పోవడంతో ఈ సారి తన పుట్టిన రోజు వేడుకను జరుపవద్దని తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారంట. గత సంవత్సరం ఆగస్టు29 న నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరి కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన ఈ సంవత్సరం ఏ విధమైన వేడుకలు జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నారు.