ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటా: ప్రభాస్‌

‘నేను ఏదైనా సినిమా ఒప్పుకునే ముందు…పాత్రలోకి లీనమైపోగలనా, అందులో జీవించగలనా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటా’ అని ప్రభాస్‌ అంటున్నారు ‘బాహుబలి’తో ఇంటర్నేషనల్ గా గుర్తింపు పొందిన ఆయన తన కెరీర్‌ గురించి ఓ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. ‘బాహుబలి’ సినిమాకు ఓ రేంజిలో రెస్పాన్స్ రావటం తన అదృష్టమని అభిప్రాయపడ్డారు.

అలాగే ‘అభిమానులు నన్ను ఇంతగా ప్రేమించి, ఆదరించడం నా అదృష్టం. ప్రజలు నా నుంచి చాలా ఆశిస్తున్నారు. నా నుంచి ది బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ప్రతి ప్రాజెక్టు వారి అంచనాలకు తగ్గట్టు ఉండేలా చూసుకుంటా’అని చెప్పుకొచ్చారు. ఇక ‘నేను స్క్రిప్టు ఎంచుకునేటప్పుడు.. నా అభిమానులు నన్ను ఎలాంటి పాత్రలో, కథలో చూడాలనుకుంటున్నారని ఆలోచిస్తా. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటా. అదంతా స్క్రిప్టు మీద ఆధారపడి ఉంటుంది. నేను పాత్రలోకి లీనమైపోగలనా, అందులో జీవించగలనా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటా’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు.

ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. ముంబయిలో షూటింగ్ జరుగుతోంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ త్రయం సంగీతం అందిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.