బిజినెస్ ట్రిక్‌లోనే కాదు..  సోషల్ అవేర్‌నెసుల్లోనూ ఈ బ్యూటీది ముందంజే !

 
మేకప్…ప్యాకప్. ఈ రెండే సినిమా జీవితం. ముఖ్యంగా హీరోయిన్లైతే బయట ప్రపంచాన్ని పట్టించుకోరు. సినిమాల్లో నటించామా..రెమ్యూనరేషన్ అందిందా లేదా. సినిమాలు కాకుంటే ఓపెనింగ్‌లతో హంగామా చేస్తారు. కానీ ఇప్పుడు హీరోయిన్లు సినిమాలే కాదు సందేశాలూ ఇస్తున్నారు. సమాజంలో ఏం జరుగుతుందో వాటిపై స్పందిస్తున్నారు. కనువిప్పు కలిగేలా వినూత్నంగా జనాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
ఇక యంగ్ హీరోయిన్లైతే ఈ బాధ్యతను అందరికంటే ముందే భుజానికి ఎత్తుకుంటున్నారు. అందులో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ ‌సింగ్ ముందు వరుసలో ఉన్నారు.  బిజినెస్ ట్రిక్‌లోనే కాదు సోషల్ అవేర్‌నెస్ ప్రోగ్రాముల్లోనూ ముందున్నారు. చిన్నచిన్న చారిటీలకు ఎప్పుడూ ఆమె ఆపన్నహస్తం అందిస్తూనే ఉంటారు. ఇక ట్రాఫిక్ అవేర్‌నెస్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్లు ధరించాలని సూచించారు. ప్రతీఒక్కరూ సీటు బెల్టు పెట్టుకోవాలంటూ అడ్వైజ్‌లు ఇచ్చారు. వహ్హ్.. గ్రేట్  రకుల్ ప్రీత్ ‌సింగ్!!?