సాయి ధరమ్ తేజ్ సరసన నిహారిక.?

‘ఒక మనసు’ సినిమాతో మెగా డాటర్ నిహారిక హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. వన్ అండ్ ఓన్లీ మెగా హీరోయిన్‌గా నిహారిక పేరు తెచ్చుకోవాలని ఆరాట పడింది.

కానీ, వర్కవుట్ కాలేదు. తొలి సినిమానే బెడిసికొట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా ట్రై చేసింది కానీ, పలించలేదు. దాంతో, సినిమాలకు గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని సెటిలైపోయింది.

అయినా నిహారికలో సినిమా పిచ్చి పోలేదు. నిర్మాతగా అప్పుడప్పుడూ తన అభిరుచిని చాటుకుంటోంది నిహారిక. ఓటీటీ వేదికగా కొన్ని వెబ్ సిరీస్‌లు నిర్మించింది.

ఈ క్రమంలోనే నిహారిక నిర్మాణంలో తాజాగా ఓ వెబ్ సిరీస్ రానుందట. నిహారిక నటిస్తూ ఈ సిరీస్‌ని నిర్మంచబోతోందట. ఈ సిరీస్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గెస్ట్ రోల్ పోషించనున్నాడనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.

స్టోరీ మొత్తం నిహారిక చుట్టూనే తిరుగుతుందట. కానీ, తేజు రోల్ చాలా కొత్తగా సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందనీ ఇండస్ర్టీ వర్గాల్లో గట్టిగా టాక్ నడుస్తోంది. ఓ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్‌ని ఈ సిరీస్ కోసం ఎంగేజ్ చేశారట. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయ్.