Election Commission Of India: ఓటర్ల జాబితాలో మార్పులు: ఈసీఐ తీసుకున్న మూడు కీలక నిర్ణయాలు!

ఎన్నికల వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మూడు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా కచ్చితత్వం పెంచడం, ఓటింగ్ సదుపాయాలు మరింత సులభతరం చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టింది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇందులో ప్రధానంగా, మరణించిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇకపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద నమోదైన మరణాల సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలో ఏరీఓలకు చేరుతుంది. బూత్ స్థాయిలో బీఎల్వోలు స్థితిగతులు పరిశీలించి ధృవీకరించిన తర్వాత, సంబంధిత పేర్లను ఫారం-7కు ఎదురు చూస్తేనే తొలగించాల్సిన అవసరం లేకుండా చేస్తారు.

మరొక కీలక నిర్ణయం ఓటర్ సమాచారం స్లిప్ పునరుద్ధరణ. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం, సీరియల్ నెంబర్ వంటి ముఖ్యమైన వివరాలను తేలికగా గుర్తించేందుకు, ఈ స్లిప్‌ను పెద్ద అక్షరాలతో ముద్రించేలా కొత్త ఫార్మాట్‌లో రూపొందించనున్నారు. ఇది ఓటర్లకు మాత్రమే కాకుండా, పోలింగ్ అధికారులకు కూడా గణనీయంగా ఉపయోగపడనుంది.

చివరిగా, బూత్ లెవల్ అధికారుల గుర్తింపును బలోపేతం చేసేందుకు వారికి ప్రామాణిక ఫోటో ఐడీ కార్డులను జారీ చేయనున్నారు. ఇంటింటి సర్వేలు, ఓటరు నమోదు సమయంలో బీఎల్వోల పరిచయం స్పష్టంగా ఉండటం వల్ల ప్రజలలో నమ్మకం పెరుగుతుందని, ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగుతుందని ఈసీఐ అంచనా వేసింది. ఈ మూడు మార్పులతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే దిశగా ఎన్నికల సంఘం ముందుకు సాగుతోంది.

తప్పు వారిదే || Analyst Purushottam Reddy Reacts On Simhachalam Temple Incident || Telugu Rajyam