బాలీవుడ్ బాబులకి కుల్లెక్కువే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా “ఆర్.ఆర్.ఆర్. కి ఆస్కర్” అనే హీట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై ఈ ప్రకటన వచ్చిన క్షణం నుంచి.. దేశవ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్. పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అటు దేశప్రధాని నుంచి మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, సామాన్య ప్రజానికం వరకూ ట్రిపుల్ ఆర్ టీం కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా వస్తున్న ప్రసంసలతో ట్రిపుల్ ఆర్ టీం తడిసి ముద్దవ్తుంది. ఆ సంగతులు అలా ఉంటే… ఈ విషయంలో కనీసం శుభాకాక్షలు అన్న ట్వీట్ కూడా పెట్టలేదు బాలీవుడ్ బాబులు!

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సాధించి 140 కోట్ల మంది భారతీయులను సంబరాల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ దేశం నుంచే మొట్టమొదటి సారిగా ఉత్తమ గీతంగా ఆస్కార్ గెలుచున్న ఆర్.ఆర్.ఆర్. మూవీపై ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. బిగ్ బీ అమితాబ్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ మొదలగు హీరోల నుంచి… ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, ఐశ్వర్యా రాయ్ వంటి హీరోయిన్ల వరకు ఏ ఒక్కరూ ఈ విషయంపై కనీసం ట్వీట్ మెదపడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం గమనార్హం!

దీంతో బాలీవుడ్ పై భగ్గుమంటున్నారు తెలుగు సినీ లవర్స్. ప్రపంచ సినీ వేదికపై తెలుగు సినిమాకు ఇంతటి గౌరవం కలగడం బాలీవుడ్ తారలకు ఇష్టంలేదని, వాళ్లు ఈర్ష్యతో రగిలిపోతున్నారంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ ఆన్ లైన్ రగిలిపోతున్నారు. బాలీవుడ్ సాధించలేనిదాన్ని టాలీవుడ్ సాధించిందనే కుల్లుతోనే వాళ్లంతా స్పందించడం లేదని వారంటున్నారు. కాగా ఇప్పటివరకు ఆస్కార్ వేడుకలో పాల్గొన్న దీపికా పదుకొనె ఒక్కరే నాటు నాటు సాంగ్ గురించి, ప్రశంసిస్తూ మాట్లాడారు!