Sky Smiley Face: ఆకాశంలో చిరునవ్వు… చూసేందుకు సిద్ధంగా ఉన్నారా?

ఈ నెల 25వ తేదీన తెల్లవారుజామున ఆకాశంలో ఒక అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, శుక్రుడు, శని గ్రహాలు చంద్రునికి చాలా దగ్గరగా వస్తాయి. ఈ ముగ్గురు కలిసిన క్షణాల్లో స్మైలీ రూపంలో ఒక ఆకృతి ఆకాశంలో కనిపించనుందని నాసా వెల్లడించింది. సూర్యోదయానికి ముందే ఈ దృశ్యం కనువిందు చేయనుండటంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య అకాశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఈ ఘట్టంలో శుక్రుడు, శని అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తాయి. చంద్రుని జంతుదారి ఈ గ్రహాలను కలిపేలా కనిపించడంతో ఒక చిరునవ్వు రూపం ఆకాశంలో ఏర్పడుతుంది. ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేకుండా ఈ దృశ్యాన్ని కంటితోనే వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా కనిపించనుంది.

తెలంగాణలో హైదరాబాద్ వాసులు ఈ అద్భుతాన్ని నెక్లెస్ రోడ్, గండిపేట, షామీర్‌పేట వంటి ప్రకృతి ప్రాంతాల్లో చూడొచ్చు. అలాగే వరంగల్‌లో భద్రకాళి ఆలయం, పాకాల సరస్సు వంటి ప్రాంతాలు కూడా మంచి వ్యూ పాయింట్లుగా ఉంటాయని ఖగోళ పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రకృతి వాతావరణం కలిగిన ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తే మంచి అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ వాసులూ వెనుకపడాల్సిన పనిలేదు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్‌, కొండపల్లి అడవి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ దృశ్యాన్ని చూడొచ్చు. విశాఖలో ఆర్.కె బీచ్, డాల్ఫిన్ నోస్ పాయింట్, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట వంటివి మంచి లొకేషన్లు. ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన ఆకాశాన్ని చూసే వారు మాత్రం ఈ అరుదైన దృశ్యాన్ని మర్చిపోలేరు.

ఇలాంటి ఖగోళ క్షణాలు తరచూ ఎదురవ్వవు. ఒక చిరునవ్వును పోలిన గ్రహాల సముదాయం ఆకాశంలో కనిపించడం మన భాగ్యం. ఈ దృశ్యాన్ని మన కంటితో చూడడమే కాదు, ఫోటోలు తీసి స్మరణీయంగా నిలుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ చిరునవ్వు మీరు మిస్ కాకండి.

విశాఖ ఉక్కు లేకుండా అమరావతి భవిష్యత్తు ప్రమాదంలో || Amaravati And Vizag Steel Plant Sentiment || TR