భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ చారిత్రకంగానే ఉంటున్నాయి. కానీ ఈసారి పహల్గాం దాడి, ఆ తర్వాత భారత బలగాల ఆపరేషన్ సిందూర్ వల్ల పరిస్థితి మరింత ఉత్కంఠకు తెరలేపింది. పాక్ ఆర్మీ మాజీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. “మా దగ్గర 6 లక్షల సైన్యం ఉంది, కానీ భారత్ దగ్గర 16 లక్షల సైన్యం ఉంది… గొప్ప యుద్ధం చేస్తున్నంత మాత్రాన మమ్మల్ని పాక్ ఆర్మీ కాపాడలేదు. ఈ ఉద్రిక్తతలను తగ్గించాలంటే అమెరికా ఒత్తిడి తేవాలి అని ఆయన చెప్పడం ఆ దేశ పరిస్థితిని బయటపెట్టింది.
పాకిస్థాన్లోని ప్రజలకు ఇది ఊహించని షాక్గానే కనిపిస్తోంది. ఎందుకంటే ఓ రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఈ స్థాయిలో సాటి దేశం ముందు చేతులెత్తేశామన్నట్టు చెప్పడం సాధారణం కాదు. ఇది వాస్తవానికి పాక్ అంతర్గత పరిస్థితులను, ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు IMF వద్ద నుంచి అప్పు తీసుకొని తన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ, మరోవైపు సరిహద్దుల్లో రక్తపాతం మోసుకోవడం పాక్ ప్రభుత్వానికి గందరగోళం నడుమ బతుకుతోంది.
భారత వైపు నుంచి వచ్చే ప్రతి ప్రతిఘటనకూ కేవలం జవాబు చెప్పడం కష్టమని పాక్ సైనిక వర్గాలు అంగీకరిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ముందుకు రావాలి.. అనే మాటలు బయటకు వస్తున్నాయి. కానీ, యూఎస్ పరిస్థితులు ఈసారి భిన్నంగా ఉన్నాయి. చైనా, రష్యా మధ్య స్థిరపడే క్రమంలో అమెరికా భారత్ పై ఒత్తిడి తేవడం అంత ఈజీ కాదు. ఈ దశలో పాక్ మితిమీరిన అంచనాలు పెట్టుకుంటే మరింత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మరోవైపు, భారత్ మాత్రం తక్కువ బలాన్ని లెక్కలో పెట్టక, పరిస్థితిని సరిగా అంచనా వేసి ప్రతీ అడుగు వేస్తోంది. ప్రతి దాడికి దీటుగా స్పందిస్తూ, సరిహద్దుల్లోని శాంతిని సమర్థంగా రక్షిస్తోంది. ఇక పాక్ కు నిజంగా శాంతి కావాలంటే పెద్దన్న కోసం ఎదురు చూడటం కాదు.. తన సొంత తలలో పరిష్కారం వెతకడం అవసరం.