Shehbaz Sharif: షెహబాజ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది… పాక్‌లో రాజకీయ కల్లోలం

పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ బీరాలు పలికిన షరీఫ్‌కు ఇప్పుడు తానే సమస్యగా మారారు. పార్లమెంట్‌లో మెజారిటీ సభ్యులు ఆయనను ప్రధాన మంత్రి పీఠం నుంచి దించేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ సభ్యులతో పాటు షరీఫ్ సొంత పార్టీ ఎంపీలు కూడా ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ‘‘సింహాలాంటి సైన్యాన్ని నక్క నడుపుతోంది’’ అనే ఎంపీ వ్యాఖ్యలు పాకిస్థాన్ లో తీవ్ర దుమారం రేపాయి.

ఇక దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనల బాట పట్టారు. రావల్పిండిలో విద్యార్థుల నిరసనపై పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించగా, ప్రధాని నివాసం వద్ద నాలుగు పేలుళ్లు చోటుచేసుకోవడంతో షరీఫ్ భద్రతా ఆందోళనతో వేరే ప్రాంతానికి తరలిపోయారు. అంతేకాదు, రక్షణ మంత్రి కూడా తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎక్కడో మాయం అయ్యాడని పాక్ మీడియా వెల్లడించింది. ఈ పరిణామాలు పాక్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.

సైనిక రంగంలోనూ అశాంతి నెలకొంది. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. యుద్ధ సమయంలో ఆయన కచ్చితమైన నిర్ణయాలు తీసుకోలేడని విమర్శలు వెల్లువెత్తుతుండగా, సుప్రీంకోర్టు మాత్రం మునీర్‌కు త్రివిధ దళాల అధికారం ఇచ్చింది. దీనితో ఆయన ప్రభుత్వ మద్దతు లేకుండా సైనిక నిర్ణయాలు తీసుకునే వీలు కలిగింది. అయినప్పటికీ, ఆయనకు యుద్ధ నైపుణ్యం లేదని ఆర్మీ లోపలి వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి.

ఇక, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేసి, భారత్‌పై ప్రతిదాడి చేయాలని ప్రజల్లో నినాదాలు మొదలయ్యాయి. పైగా సింధు జలాల ఒప్పందం నిలిచిపోవడంతో పాక్ వ్యవసాయ రంగం కష్టాల్లో పడింది. ఈ సమస్యలో జోక్యం చేసుకోవాలని ప్రాథేయపడ్డా, ప్రపంచ బ్యాంకు స్పష్టంగా నో చెప్పడంతో షరీఫ్ పరిస్థితి మరింత ఇరుకుగా మారింది. ఇప్పుడు పాక్ రాజకీయ భవిష్యత్తు ఏవిధంగా మలుపు తిరుగుతుందో చూడాలి.

నువ్వు ఒక పిల్ల బచ్చా..| Chitti Babu Satires On Pawan Kalyan | PM Modi | Amaravati | Telugu Rajyam