Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈటల రాజేందర్ మరోసారి వార్తల్లో నిలిచారు. మల్కాజిగిరి ఎంపీగా కొనసాగుతున్న ఆయనకు సాధారణంగా సౌమ్య స్వభావం ఉన్న నేతగా పేరుంది. కానీ, తాజాగా మేడ్చల్ జిల్లా పోచారం మునిసిపాలిటీలో చోటు చేసుకున్న ఘటనలో ఈటల తన సున్నిత స్వభావాన్ని కోల్పోయి రియల్ ఎస్టేట్ బ్రోకర్పై చెంప చెళ్లుమనిపించడం వైరల్గా మారింది.
ఈటల పర్యటన సందర్భంగా ఓ మహిళ ఆయన వద్దకు వచ్చి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై మరికొందరు బాధితులు కూడా ఈటలకు ఫిర్యాదు చేయడంతో, ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సదరు బ్రోకర్ అక్కడే ఉన్నాడని తెలుసుకున్న ఈటల, తన అనుచరులతో కలిసి అతడి వద్దకు వెళ్లారు. అక్కడే, ఆయన సదరు బ్రోకర్ను కొట్టిన తీరు చూస్తే స్థానిక ప్రజలు నివ్వెరపోయారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొట్టిన ఈటల రాజేందర్
పోచారం మున్సిపాలిటీలో సంచలన ఘటన
పేదల భూములు ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపాారిని కొట్టిన ఈటల#Telangana #Hyderabad #BRS #KTR #Congress #RevanthReddy #BJP pic.twitter.com/mNMWBViTQq
— Telugu Galaxy (@Telugu_Galaxy) January 21, 2025
ఈటల అనుచరులు కూడా అదే సమయంలో సదరు బ్రోకర్పై దాడికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాను ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ, తర్వాతి క్షణంలో ఈటల బాధితుడిని తన వద్దకు పిలిచి అతడి పరిస్థితిని ఆరా తీశారు. బ్రోకర్ను పక్కకు పంపే ప్రయత్నం చేయడం ద్వారా తన జాగ్రత్తను కూడా చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఈటల సాధారణంగా సాత్వికంగా కనిపించినప్పటికీ, కోపం వస్తే ఊగిపోతారా? అనే ప్రశ్నలు నెటిజన్లలో వినిపిస్తున్నాయి., పేదల హక్కులను కాపాడటమే తన లక్ష్యమని ఈటల మద్దతుదారులు అంటున్నారు.