Mahesh Babu: కరోనా అనేది టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చేసింది. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే కరోనా బారిన పడగా.. మెల్లగా టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా కోవిడ్ నిర్దారణ అవుతోంది. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, విస్వక్ సేన్ కి పాజిటివ్ రాగా.. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని చెప్పాడు. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. టీకా వేసుకోని వారంతా త్వరగా వేసుకోవాలని.. టీకా వల్ల పరిస్థితి విషమించకుండా ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే తిరిగి షూటింగ్ కు వెళ్లాలని ఎదురుచూస్తున్నానని తెలిపారు మహేష్ బాబు. మహేష్కు కరోనా అని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కోరుతూ కామెంట్లు పెడుతున్నారు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల న్యూ ఇయర్ను జరుపుకోవడానికి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్కు వెళ్లారు. అక్కడ వారంతా సంతోషంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే తాజాగా ట్రిప్ నుండి వెనక్కి వచ్చిన మహేశ్కు కరోనా నిర్దారణ అయినట్టుగా తెలుస్తోంది.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022