Big Scam: ఢిల్లీ మరో భారీ స్కామ్.. లిక్కర్ కేసులో ఉన్నవారే మరోసారి..

ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌లకు మరో అవినీతి కేసు రూపంలో షాక్ తగిలింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వీరిద్దరిపై, తరగతి గదుల నిర్మాణంలో అవకతవకల ఆరోపణలతో ఢిల్లీ ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) తాజాగా కేసు నమోదు చేసింది.

గత ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. వీటిని సెమీ-పర్మనెంట్ స్ట్రక్చర్‌లుగా రూపొందించడంలో భారీ ఖర్చు జరిగిందని ఏసీబీ గుర్తించింది. చదరపు అడుగుకి రూ. 2,292 వసూలు చేయడం ద్వారా ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 2,000 కోట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు.

ఈ నిర్మాణ వ్యయం కాంక్రీట్ భవనాలకు అయ్యే ఖర్చుతో సమానంగా ఉండడంపై ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది. కన్సల్టెంట్ల ఎంపిక, టెండర్ల విధానం, ప్రాజెక్టు వ్యయ పెంపు అన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక కూడా ఇదే విషయాల్ని పేర్కొనగా, దాన్ని మూడేళ్లుగా దాచిపెట్టారని సమాచారం.

ఈ ప్రాజెక్టును 34 మంది కాంట్రాక్టర్లకు అప్పగించగా, వారిలో చాలామందికి ఆప్ పార్టీలో సంబంధాలున్నాయని ఏసీబీ చెబుతోంది. నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల కూడా వ్యయం భారీగా పెరిగిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. టెండర్లు మళ్లీ పిలవకుండానే రూ. 326 కోట్లు అదనంగా మంజూరు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ కేసు రాజకీయంగా మరోసారి ఆప్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం కనిపిస్తోంది.

Public EXPOSED: Simhachalam Temple Incident || Ap Public Talk || Chandrababu || Ys Jagan || TR