Delhi Elections: ఢిల్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. కేజ్రీవాల్ ఓటమి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ సంచలనం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 3,000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది ఆప్ పార్టీకే కాదు, మొత్తం రాజకీయ వర్గాలకూ ఊహించని పరిణామంగా మారింది.

కేజ్రీవాల్ మాత్రమే కాదు, ఆప్ కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా ఓటమిని ఎదుర్కొన్నారు. జంగ్‌పురా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సిసోడియా, బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జైలుశిక్ష అనుభవించిన సిసోడియాకు ప్రజలు అనుకూలంగా నిలిచే అవకాశం ఉందనుకున్నప్పటికీ, ఆ అంచనాలు తప్పాయి.

ఓటముల పరంపరలో కూడా ఆప్ పార్టీకి కాస్త ఊరట కలిగించిన ఏకైక విజయం కోండ్లి నియోజకవర్గంలో నమోదైంది. ఇక్కడ ఆప్ అభ్యర్థి కుల్ దీప్ కుమార్, బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6,293 ఓట్ల తేడాతో గెలిచారు. మరోవైపు, బీజేపీ ఖాతా లక్ష్మీనగర్‌లో తెరుచుకుంది. అభయ్ వర్మ విజయం సాధించడం బీజేపీ విజయంపై మరింత పట్టుబట్టేలా చేసింది.

ఈ ఎన్నికల ఫలితాలు ఢిల్లీ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. గత ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన ఆప్, ఈసారి గట్టిగా ఎదురుదెబ్బ తిన్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా కేజ్రీవాల్ ఓటమి పార్టీ భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తెరపైకి తెచ్చింది. మరోవైపు, బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది.

పాపం జగన్ కి ద్రోహం || Mallikarjun Kharge Shocking Comments On CM Chandrababu || Modi || TR