‘భోళా శంకర్’ నచ్చలేదు బాసూ.! ఏం చేద్దాం మరి.?

రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. ‘భోళా శంకర్’ సంగతేంటి.? అదైతే సస్పెన్స్. ‘గాడ్ ఫాదర్’ వచ్చేసింది, ‘వాల్తేరు వీరయ్య’ కూడా వచ్చేస్తోంది. ‘భోళా శంకర్’ వ్యవహారం మాత్రం అయోమయంలో పడింది.

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వేదాలం’ సినిమా తొలుత పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది. అట్నుంచి చిరంజీవి దగ్గరకు వచ్చింది. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలుత సాయి పల్లవిని అడిగారు.. ఆమె ‘నో’ చెప్పడంతో, కీర్తి సురేష్ వచ్చింది.

హీరోయిన్‌గా ఫేడవుట్ అయిపోయిన తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. వచ్చిన పార్ట్ కూడా ఏమంత గొప్పగా లేదని చిరంజీవి అనుకుంటున్నారట.

ప్రాజెక్టుని అటకెక్కించేద్దామా.? అన్న ఆలోచనలో చిరంజీవి వున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, మెహర్ రమేష్ కెరీర్ ఏమవ్వాలి.? ఈ ఒక్క సందేహం చుట్టూ చిరంజీవి తటపటాయిస్తున్నట్లు సమాచారం. సినిమా దాదాపు అటకెక్కేసినట్లేనని అంటున్నారు. నిజమేనంటారా.?