ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెనక్కి తగ్గాడు. జనవరి 12న విడుదల చేయాల్సిన ‘వారసుడు’ సినిమాని, జనవరి 14వ తేదీకి మార్చాడు.
అసలు దిల్ రాజుకి ఎలా జ్ఞానోదయమయ్యింది.? ‘నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు డబ్బులు ముఖ్యం..’ అని చెప్పిన దిల్ రాజు, ఇప్పుడిలా మారిపోయి, ‘నా హీరోలు.. నా టాలీవుడ్’ అని ఎందుకు అంటున్నట్లు.?
నందమూరి బాలకృష్ణ తన సినిమా ‘వీర సింహా రెడ్డి’ని చాలా సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా మీద దెబ్బ పడే ఏ విషయాన్నీ ఆయన సహించే స్థితిలో లేడు. ఈ నేపథ్యంలో దిల్ రాజుకి, బాలయ్య వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు.
అందుకే, తమిళంలో జనవరి 11న విడుదలవుతున్నా, ఆ డేట్ని కూడా దిల్ రాజు వినియోగించుకోలేకపోయాడు. బాలయ్య మాత్రమేనా, చిరంజీవి కూడా దిల్ రాజుకి క్లాస్ తీసుకున్నారని అనుకోవచ్చా.? ఏదైతేనేం, దిల్ రాజులో మార్పు వచ్చింది. వెనక్కి తగ్గాడు.
