అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే ఉప్పు డబ్బాలు ఈ మూడు వస్తువులు పెడితే చాలు!

salt-shaker

ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఒకటే ఉంటే సరిపోదు మనం మన జీవితం ముందుకు నడవాలన్న తప్పనిసరిగా డబ్బు అవసరం అవుతుంది. ఈ విధంగామానవాళి మణుగడం మొత్తం డబ్బుపై ఆధారపడడంతో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు. అయితే డబ్బు మన చేతికి వచ్చినట్టే వచ్చి నీళ్లలా ఖర్చవుతూ ఉండడంతో చాలామంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు మనల్ని  చుట్టుముట్టకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మన వంట ఇంట్లో ఉండే ఉప్పులో ఈ మూడు రకాల వస్తువులు ఉంచడం ఎంతో మంచిది.

 

శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ప్రీతికరమైన రోజు. అందువల్ల ఆరోజున ఒక మట్టి జాడిని తీసుకొని  లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత ఒక రాగి  లేదా ఇతడి ప్లేట్ తీసుకొని  ఈ ప్లేట్లో కొత్త పసుపు వస్త్రాన్ని ఉంచాలి. ఆ తరువాత ఈ వస్త్రానపై 9 వక్కలను, ఒక పసుపు కొమ్మును ,వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట కట్టాలి. తరువాత ఈ మూటను మట్టి జాడీలో అడుగు బాగానే ఉంచి దానిపైన రాళ్ల ఉప్పును పోయాలి.

 

ఈ విధంగా మట్టి జాడీలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పుని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది. అందుకే ఉప్పును ఎప్పుడూ కూడా దానం చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.