తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం !

తిరుపతి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16, శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. గతనెలలో అధిక ఆశ్వీయుజంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన విషయం విదితమే.

tirumala navaratri brahmotsavalu starts
tirumala navaratri brahmotsavalu starts

అక్టోబర్ 16 ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. తరువాత ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆస్థానం జరిగింది. ఈ సేవలలో ఆలయ ఈవో జవహర్రెడ్డితోపాటు స్వామీజీలు, ఇతర అధికారులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.