పెళ్లి పేరుతో మగాళ్ళను మాయ చేస్తున్న కిలాడి లేడి.. అమ్మడి స్కెచ్ మామూలుగా లేదుగా?

సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంతో పద్ధతిగా భర్తతో పిల్లలతో తన కుటుంబాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. అయితే ఈ కిలాడి లేడి మాత్రం పెళ్లిళ్ల పేరుతో ఏకంగా మగాళ్ళు అందరిని మాయ చేస్తూ దొరికిన కాడికి దోచుకుంటూ అందరిని మాయ చేస్తుంది. చూడటానికి ఎంతో అమాయకంగా కనిపించే ఈ అమ్మాయి పేరు అభినయ. అందరితో ఎంతో అభినయంగా ప్రదర్శిస్తూ ఈజీగా తన మాయలో వేసుకుంటుంది. 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభినయ తంబారా రంగనాథపురానికి చెందిన నటరాజన్‌ని పెళ్లి చేసుకుంది.

తనకు పెళ్లి జరిగిందని ఎంతో సంతోషపడిన నటరాజన్ సంతోషం కొన్ని రోజులు కూడా లేకుండా పోయింది. బేకరీలో పని చేస్తున్నటువంటి అభినయ నటరాజనుకు పరిచయం కావడంతో ఆగస్టులో వివాహం చేసుకున్నారు. అక్టోబర్ లో ఆమె ఇల్లు వదిలి పారిపోయింది.అయితే ఇంట్లో నుంచి పారిపోయే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి 17 రకాల బంగారు నగలతో పాటు సిల్క్ చీరలు కొంత డబ్బును కూడా తనతో పాటు తీసుకు వెళ్లడంతో తనని మోసం చేసిందని గ్రహించిన నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేసి తనని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పారు.

అతని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి ఆమె ఫోన్ ట్రాప్ చేస్తూ వచ్చారు. అయితే నెలరోజుల పాటు స్విచ్ ఆఫ్ చేసినటువంటి అభినయ మహాబలిపురంలో మరొక వ్యక్తిని ట్రాప్ లో దించడానికి ప్రయత్నం చేశారు.ఇది గుర్తించిన పోలీసులు తనని అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం తెలిసి పోలీసులు కూడా కంగుతిన్నారు. ఈమె నటరాజన్ మాత్రమే కాదు అంతకుముందు ఇద్దరు వ్యక్తులను ఇలాగే పెళ్లి పేరుతో పెళ్లి చేసుకుని వారిని దారుణంగా మోసం చేసింది.మరొక విషయం ఏమిటంటే ఈమె మొదట పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఒక కుమారుడికి జన్మనిచ్చిన కూడా తనని వదిలి వెళ్లిపోవడం గమనార్హం.