నిమ్స్ లో దారుణం… ఆపరేషన్ చేసి కత్తెరను కడుపులోనే మర్చిపోయిన డాక్టర్లు

నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కత్తెరను కడుపులోనే మర్చిపోయారు. దీంతో ఆ మహిళకు గత మూడు నెలల నుంచి కడుపు నొప్పి వచ్చి అనారోగ్యానికి గురైంది.

మహేశ్వరి అనే మహిళ 3 నెలల క్రితం హెర్నీయాకు సంబంధించిన ఆపరేషన్ ను నిమ్స్ అస్పత్రిలో చేయించుకుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన మహిళకు తగ్గాల్సిన సమస్య ఎక్కువైంది. రోజు కడుపు నొప్పితో బాధపడేది. దీంతో ఎక్స్ రే తీయించగా విస్తుపోయే నిజం బయటపడింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు కత్తిని కడపులోనే మరిచిపోయారు. కడుపులో కత్తి ఉంచి మహేశ్వరికి  కుట్లు వేశారు.  

విషయం తెలుసుకున్న రోగి బంధువులు నిమ్స్ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మహేశ్వరి వేరే హస్పిటల్ లో కడుపులో ఉన్న కత్తిని తొలగించినట్టు తెలుస్తోంది.  వైద్యుల నిర్లక్ష్యం పై పలువురు విమర్శించారు.