గుంటూరు జిల్లా మాచర్లలో మర్డర్

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. సినీ ఫక్కిలో వ్యక్తిని హత్య చేశారు. చెరుకుపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవల బయటికి వచ్చాడు. ప్రేమ్ కుమార్ భార్య వెల్దూరి మండలం శిరిగిరిపాడులో టిచర్ గా పనిచేస్తోంది. భార్యను కలిసేందుకు ప్రేమ్ కుమార్ వెళుతుండగా దుండగులు వెంబడించి హత్య చేశారు.

చనిపోయిన ప్రేమ్ కుమార్

ప్రేమ్ కుమార్ మాచర్ల నుంచి బుల్లెట్ బైకు పై వెళుతుండగా కారులో దుండగులు వెంబడించారు. కత్తులు, గొడ్డళ్లతో వెంటాడి దాడి చేశారు. బైక్ ను వదిలి ప్రేమ్ కుమార్ పారిపోతుండగా వేటాడి వెంటాడి నరికేశారు. కత్తి పోట్లకు ప్రేమ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య జరగడంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.