భర్త కువైట్ లో.. ఊళ్లో భార్య అక్రమ సంబంధం.. చివరికి ఏమైందంటే

వివాహేతర సంబంధం వారి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా ప్రియుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం పడిగెలపల్లికి చెందిన సుంకర సరస్వతికి వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమె భర్త ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. సరస్వతికి పెళ్లికి ముందు నుంచే కడపకు చెందిన శ్రావణ్ తో పరిచయం ఉంది. వీరిద్దరు తరుచు ఫోన్ మాట్లాడుకునేవారు. అలా వీరికి శారీరక సంబంధం ఏర్పడినట్టు స్థానికులు తెలిపారు.

శుక్రవారం మండల పరిధిలోని గంగమ్మ జాతరకు శ్రావణ్ వచ్చాడు. ఆ సమయంలోనే సరస్వతికి ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఫోన్ లో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సరస్వతి ఇంటికి శ్రావణ్ వచ్చేలోపు ఆమె దూలానికి ఉరేసుకొని ఉంది. దీంతో ఆమెను కిందకు దింపి ఆస్పత్రికి తరలించేందుకు శ్రావణ్ యత్నించాడు. ఇంతలో ఊళ్లోవారు ఆయనను చుట్టిముట్టి కొట్టే ప్రయత్నం చేయగా బైక్ పై పారిపోయాడు. ఇంతలో సరస్వతి చనిపోయింది.

బైక్ పై పారిపోయిన శ్రావణ్ రిమ్స్ రోడ్డులో బైక్ తో సహా సజీవనమయి ఉన్నాడు. అయితే అతను ప్రమాదంలో చనిపోయాడా లేక అతనిని వెంటాడి ఎవరైనా పెట్రోల్ పోసి చంపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలంలోనే రెండు సెల్ ఫోన్లు లభించడంతో ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు.