చేతబడి చేశారన్న అనుమానంతో సొంత బాబాయిని దారుణంగా చంపిన యువకుడు?

కాలం ఎంతో ముందుకు పరుగులు పెడుతున్నప్పటికీ కొందరు మాత్రం తమ మూర్ఖత్వంలోనే బ్రతుకుతున్నారు. ఈ క్రమంలోనే తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి అనుమానం ఏకంగా ఒక కుటుంబం ప్రాణాలను బలి తీసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..

కర్నూలు జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లికి చెందిన కుక్క మల్లికార్జున యాదవ్‌ అనే వ్యక్తి తరచూ తన బాబాయ్‌ తిరుమలయ్య పై అనుమానాలు వ్యక్తం చేసేవారు.తన బాబాయ్ తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పోతున్నారని అందుకే తను ఎదగకుండా క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి అనుమానంతో ఉండేవారు.అయితే ఈ విషయంపై ఓ స్వామీజీ చెప్పిన మాటలను నమ్మి ఏకంగా తన బాబాయ్ తిరుమలయ్యను చంపాలని పథకం వేశాడు. ఈ క్రమంలోనే మల్లికార్జున యాదవ్ తన బాబాయ్ కుటుంబం పై రాళ్లతో దాడి చేశారు.

ఈ విధంగా తిరుమలయ్య కుటుంబం పై దాడి చేయడంతో తిరుమలయ్య భార్య అక్కడికక్కడే మృతి చెందగా తిరుమలయ్య ఆయన కూతురు స్వప్న హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తిరుమలయ్య కుమార్తె స్వప్న నిండు గర్భిణీ. గర్భిణి అని కూడా చూడకుండా చెల్లెలపై ఇలా దారుణంగా మల్లికార్జున యాదవ్ ప్రవర్తించడం అందరినీ విష్మయానికి గురిచేసింది.అయితే ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మల్లికార్జున యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం అనుమానమే ఓ కుటుంబ ప్రాణాలను బలి తీసుకుందని చెప్పాలి.