కూతురు వయస్సు ఉన్న అమ్మాయి పై కన్నేశాడు… చివరికి

గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. తెనాలి ప్రాంతానికి చెందిన బిట్రా సుధాకర్, భవాని దంపతులు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. వీరు స్థానికంగా ఉన్న కంపెనీలో పని చేసేవారు. సుధాకర్ కు సత్యనారాయణ అనే స్నేహితుడు ఉండేవాడు. సత్య నారాయణ ఫ్యామిలీ సుధాకర్ ఫ్యామిలీ చాలా క్లోజ్ గా ఉండేది.

సత్యనారాయణకు, భార్యకు గొడవ జరగడంతో ఆమె సత్యనారాయణను వదిలి పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో సత్యనారాయణ సుధాకర్ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడు. ఈ క్రమంలో సుధాకర్ బిడ్డ జ్యోతి పై సత్యనారాయణకు కన్ను పడింది. ఇతరులతో జ్యోతిని పెళ్ళి చేసుకుంటానని సత్యనారాయణ అడిగించాడు. దీంతో వారు నిలదీయగా నేను అలా అనలేదని చెప్పి తప్పించుకున్నాడు.

జ్యోతికి సంబంధం చూసేందుకు తల్లిదండ్రులు గురువారం ఏలూరుకు వెళ్లారు. జ్యోతి మరొకరికి దక్కడం ఇష్టం లేని సత్యనారాయణ జ్యోతి ఇంట్లో ఒంటరిగా  ఉన్న విషయం తెలుసుకొని వెళ్లాడు. అక్కడ ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరుమన్నారు. సత్యనారాయణకు జ్యోతి వయస్సున్న కొడుకు ఉండడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.