కర్నూలు జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో కన్న తండ్రి చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు?

ప్రస్తుత కాలంలో పురుషులు స్త్రీలు అని తేడా లేకుండా అందరూ మద్యానికి బానిసలు అవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా మద్యానికి అలవాటు పడుతున్నారు. అయితే ఈ మద్యం అలవాటు కారణంగా కుటుంబంలో కలహాలు రేకెత్తుతున్నాయి. ఈ అలవాటు కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి విడాకులు తీసుకుని ఒకరికొకరు దూరం అయ్యి పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. మరికొంతమంది భార్య ల మీద అనుమానం పెంచుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఉన్న ఒక తండ్రీ చేసిన పని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

వివరాలలోకి వెళితే…కర్నూలు జిల్లా కోడుమూరులో యోగేష్, సుజాత దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే యోగేష్ మద్యానికి అలవాటు పడి దానికి బాగా బానిస అయిపోయాడు. ఈ క్రమంలో రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి వారితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్య తనతో సరిగా మాట్లాడకపోవడంతో ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు. ఈమధ్యం అలవాటు కారణంగా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా యోగేష్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న యోగేష్ తన భార్య మీద అనుమానం పెంచుకొని నిద్రపోతున్న తమ ఇద్దరు పిల్లలను ఆటోలో ఎక్కించుకొని ప్యాలకుర్తి సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్లాడు.

ఆటో వేగాన్ని పెంచి పిల్లలతో సహా ఆటోని కాలవలోకి వదిలేసి తాను ఆటో నుంచి కిందకి దూకేశాడు. అయితే ఆటో కాల్వలో పడకుండా కాలువ పక్కన ఉన్న ఒక సిమెంటు దిమ్మెను ఢీకొని ఆగిపోయింది. అయితే పిల్లలు మాత్రం కాలువలో పడిపోయారు. దీంతో వారు భయంతో గట్టిగా ఏడవటం మొదలు పెట్టారు. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పిల్లల ఏడుపు విని అక్కడికి వెళ్ళి చూడగా ఇద్దరు పిల్లలు కాలువలో పడి ఏడుస్తున్నారు. వెంటనే వారు పిల్లల్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలను అక్కున చేర్చుకొని వారికి ఆహారం నీళ్లు అందించారు. పిల్లలను వివరాలు అడిగి తమ తల్లి వద్దకు చేర్చారు. యోగేష్ మాత్రం పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న యోగేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.