ఈ వ్యక్తి ఆడ నా మగ నా తేల్చుకోలేక హైదరాబాద్ పోలీసులు పరేషాన్

హైదరాబాద్ లోని కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో న్యూ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్ పోలీసులకు ఈ కేసు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో అంతు దొరకక పోలీసులు లబోదిబోమంటున్నారు. మాకు క్లారిటీ ఇవ్వండి మొర్రో అంటూ ఫొరెన్సిక్ డాక్టర్లను పోలీసులు వేడుకుంటున్నారు. సంచలన మలుపులు తిరుగుతున్న కుషాయిగూడ కార్ల చీటింగ్ కేసులో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కార్ల చీటింగ్ కేసులో ఈ నెల 3వ తేదీన పోతులయ్య, సయ్యద్ సిరాజ్ హుస్సేన్ లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్టయిన సయ్యద్ సిరాజ్ హుస్సేన్ అడ వ్యక్తినా లేదంటే మగ నా అనే విషయం తెలియక గందరగోళంలో పడ్డారు కుషాయిగూడ పోలీసులు. 

కేసు విచారణలో భాగంగా మగ మనిషిగా భావించి నిందితుడిగా పరిగణించిన పోలీసులు ఆ మేరకు చర్యలు చేపడుతున్నారు. కానీ కేసు డైరీ నమోదు సమయంలో జెండర్ కాలమ్ నింపే టైంలో తాను అడ్డ పిల్ల అని సదరు వ్యక్తి సయ్యద్ సిరాజ్ హుస్సేన్చె ప్పడంతో పోలీసులు కంగు తిన్నారు. ఈ కేసులో ఎలా ముందుకు పోవాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. 

మూడు సంవత్సరాల క్రితం ముంబయి లో లింగ మార్పిడి చేయించుకున్నట్లు సిరాజ్ చెప్పడంతో పోలీసులు మరింత డైలమాలో పడ్డారు. తన పేరు సయ్యద్ సిరాజ్ హుస్సేన్ కాదని, షాభిన అస్మి అని ఆ వ్యక్తి పోలీసులకు తేల్చి చెప్పారు. కరీంనగర్ జిల్లా ఫతేపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని అని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు.

కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసింది అడా మగ తేలిన తర్వాతే ఈ కేసులో తదుపరి విచారణకు వెళ్లాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఆ వ్యక్తికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గాంధీ ఆసుపత్రిలోని ఫొరెన్సిక్ విభాగానికి లేఖ రాశారు. 

షాభిన అస్మి అలియాస్ సిరాజ్ హుస్సేన్ కు వైద్య పరీక్షలు జరిపి నివేదిక ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు. వైద్యుల నివేదిక ఆధారంగా సదరు నిందిత వ్యక్తి ఆడ నా లేదా మగ అన్నది తేల్చుకుని జెండర్ కాలమ్ నింపి కేసును ముందుకు కదిలించే పనిలో పడ్డారు కుషాయిగూడ పోలీసులు.

మొత్తానికి నేరస్తులు, నిందితులను చెడుగుడు ఆడుకునే పోలీసులకు ఈ వ్యక్తి చుక్కలు చూపిస్తున్నాడని టాక్ మొదలైంది.