గంట గ్యాప్ లో ఉరివేసుకుని చనిపోయిన మామ – కోడలు .. కారణం తెలిస్తే దీనికే చనిపోయారా అంటారు !

father in law and daughter in law commit suicide in telangana

చిన్న చిన్న కలహాలకే ప్రాణం తీసుకుంటున్నారు ఈరోజుల్లో. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు.. అనే విషయాన్ని మరిచిపోయి.. ప్రాణందేముంది అని తీసేసుకుంటున్నారు. నా ప్రాణం నా ఇష్టం.. అన్న రీతిలో బిహేవ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే సమస్యలు తీరిపోతాయని కొందరు, ఆత్మహత్య చేసుకోకపోతే బతకలేనని కొందరు.. చిన్న చిన్న గొడవలకు, మనస్పర్థలకు కొందరు, జాబ్ లేదని కొందరు, డబ్బులు లేవని కొందరు, పెళ్లి కాలేదని ఇంకొదరు.. ఇలా కారణాలు వెతుక్కొని మరీ ఆత్మహత్య చేసుకుంటున్నారు.

father in law and daughter in law commit suicide in telangana
father in law and daughter in law commit suicide in telangana

ఈ ప్రపంచంలో సమస్యలు లేనివారు ఎవ్వరూ ఉండరు. సమస్యలు లేనివారు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్లు దేవుళ్లు మాత్రమే. ఆత్మహత్య చేసుకోవడం సులభమే. కానీ.. ఆత్మహత్య వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో ఆలోచించరు. ఆలోచిస్తే అటువంటి పని చేయరు కదా.

ఇప్పుడు మనం చదవబోయే స్టోరీ కూడా అటువంటిదే. ఓ మామ, కోడలు.. ఇద్దరు కేవలం గంట గ్యాప్ లోనే ఆత్మహత్య చేసుకున్నారు. కోడలు ఆత్మహత్య చేసుకున్న గంటకే మామ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్నది.

అదే జిల్లాకు చెందిన పసల మర్రయ్య కొడుకు జోసెఫ్ నాలుగేళ్ల కింద మానస అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మర్రయ్య చిన్నకొడుకు కూడా తన వదిన మానస చెల్లెలు రీచాను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు.

ఇద్దరు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. కనీస తల్లిదండ్రులకు కూడా చెప్పకపోవడంతో ఇంట్లో గొడలు అయ్యాయి. అందరూ పెద్ద కోడలు మానసను తిట్టడంతో మనస్థాపం చెందిన మానస.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.

ఆమె ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని మర్రయ్య.. వెంటనే పక్కనే ఉన్న పశువుల కొట్టానికి వెళ్లి అక్కడ ఉరి వేసుకొని చనిపోయాడు.

గంట వ్యవధిలోనే మామ, కోడలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.