ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పోలీసులకు,  మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంద్రావతి నది సమీపంలో ఈ కాల్పులు జరిగాయి.

ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రి, మావోల తుపాకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం మావోలు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు సెర్చ్ చేశారు. తెలంగాణ ప్రాంత సరిహద్దులో ఎన్ కౌంటర్ జరగడంతో అటు తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మావోల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో  గస్తీ పెంచారు.