వైద్యుల నిర్లక్ష్యానికి చౌటుప్పల్ శ్వేత మృతి (వీడియోలు)

వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. వనస్థలిపురం లైఫ్ స్ప్రింగ్ వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత చనిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కు చెందిన శ్వేత ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో గత నెల చేరింది. శ్వేతకు ఆపరేషన్ చేసేన వైద్యులు పెద్ద పేగును కత్తిరించారు. ఆ తర్వాత ఒక పేగుకు బదులు మరో పేగును అతికించారు. అంతే కాకుండా కుట్లు కూడా సరిగా వేయలేదు.  

విషయాన్ని గమనించిన వైద్యులు అసలు తప్పును ఒప్పుకొని శ్వేతకు చికిత్స అందించారు. చికిత్సకు పైసలు మాత్రం తీసుకుంటూనే ఉన్నారు. శ్వేత పరిస్థితిలో మార్పు లేక ఆదివారం మరణించింది. వైద్యులు శ్వేత వైద్యం కోసం  దాదాపు 8 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. వైద్యుల నిర్లక్ష్యానికి శ్వేత మరణించిందని బంధువులు ఆందోళన నిర్వహించారు.   పొరపాటున తప్పు జరిగిందని డాక్టరే స్వయంగా ఒప్పుకున్న వీడియో కింద ఉంది చూడండి. 

 

life spring doctor