Crime News: కొత్త జంట ప్రాణాలు తీసిన పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్…!

Crime News: ఈ మధ్యకాలంలో పెళ్లి అంటే భోజనాలు, పెళ్లి మండపాలు మాత్రమే ఫొటో షూట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఫ్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ చాలామంది ఫోటోలు తీయించుకోవడానికి కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలలో అనుకోని విధంగా ఫోటో షూట్ ప్రాణాల మీదికి తెచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఇటువంటి సంఘటన వల్ల కొత్త జంట ప్రాణాలమీదకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే….కోజికోడ్​ సమీపంలోని కుట్టియాడికి చెందిన రెజిల్,కార్తిక్ దంపతులు మార్చి 14 వ తేదీన బంధుమిత్రుల మద్య వివాహబంధంతో ఒక్కటై ఎంతో సంతోషంగా ఫోటో షూట్ చేయించుకోవడానికి నది వద్దకు వెళ్లారు. కానీ ఆ ఫోటో షూట్ వారి పాలిట మృత్యువు లా మారి వరుడిని కబళించింది.

వివాహం తర్వాత పోస్ట్ వెడ్డిండ్ ఫోటో షూట్ కోసం కట్టియాడి నది వద్దకువెళ్లారు. అక్కడ ఫోటోలు దిగితున్న సమయంలో అనుకోకుండా నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. వెంటనే దంపతులిద్దరూ గట్టిగా కేకలు వేయగా స్థానికులు స్పందించి నదిలో దూకి వధూవరులిద్దరు ని కాపాడారు. చికిత్స కోసం ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా వధువు మరణించింది.వరుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.