ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ‘ఒప్పో’ శుక్రవారం మార్కెట్ లోకి ఏ3ఎస్ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. వినియోగదారులకు అందుబాటులో ఉండేలా దీని ధరను 10,990 రూ.లుగా నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది. డార్క్ పర్పుల్, రెడ్ కలర్స్ లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. జూలై 15 నుండి ప్రముఖ ఆన్లైన్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలియజేసింది.
ఒప్పో ఏ3ఎస్ ఫీచర్స్ :
- 6.2 అంగుళాల డిస్ప్లే
- 2GB RAM
- 16GB స్టోరేజ్
- 4230MAH బ్యాటరీ
- స్నాప్డ్రాగన్ 450 ఎస్ఓసీ
- డ్యూయల్ రేర్ కెమెరా
- 8MP ఫ్రంట్ కెమెరా
- AI బ్యూటీ టెక్నాలజీ 2.0
- ఆండ్రాయిడ్ 8.1
- హెడ్ ఫోన్ జాక్ సౌకర్యం కలదు.