‘ఎన్‌.జి.కె’ నిర్మాత ని ఎంత ముంచేసింది?

సూర్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రూపొందిన చిత్రం ‘ఎన్‌.జి.కె’. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ అందించారు. సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు ఉన్న క్రేజ్ కూడా తర్వాత కనపడలేదు. సినిమాకు బాగా బ్యాడ్ టాక్ రావటం దెబ్బ కొట్టింది. ఫస్ట్ వీకెండ్ లో మూడున్నర కోట్లు తెచ్చుకున్న ఈ చిత్రం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రప్పించలేకపోయింది.

ఈ చిత్రాన్ని ఎనిమిది కోట్లకు రైట్స్ తీసుకున్నారు. ఐదు కోట్లు కూడా వెనక్కి రావటం కష్టమని ట్రేడ్ లో తేల్చారు. రెండో రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ అవటంతో కష్టమే అని తేలింది.

సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటించిన ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., ఆర్ట్‌: ఆర్‌.కె.విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీరాఘవ.