`మ‌న్మ‌ధుడు 2` ఎంతకు అమ్మారో తెలిస్తే మతి పోతుంది

`మ‌న్మ‌ధుడు 2` ఎంతకు అమ్మారో తెలిస్తే మతి పోతుంది

నాగార్జున, దర్శకుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్ రీసెంట్ గా విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పెళ్ళికాని నడి వ‌య‌స్కుడిగా నాగ్ న‌ట‌న ఫ్యాన్స్ ని నవ్వుల్లో ముంచెత్తింది. ఈ నేపధ్యంలో సినిమాపై అంచనాలు పెరిగాయి.

ట్రేడ్ లోనూ క్రేజ్ క్రియేట్ అయ్యింది. దాంతో ప్ర‌స్తుతం తెలుగు రెండు రాష్ట్రాల బిజినెస్ తో స‌హా నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ కి హైప్ వచ్చింది. తెలుగు- హిందీ శాటిలైట్ రైట్స్ .. డిజిట‌ల్ హ‌క్కులు క‌లుపుకుని ఏకంగా 24 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసింద‌ని తెలుస్తోంది. ఈ స్థాయి బిజినెస్ సాగడం చాలా గొప్ప విషయం. టీమ్ కు షాకింగే.

నాగార్జున గ‌త చిత్రం దేవ‌దాస్ ఆశించిన స్థాయి విజ‌యం అందుకోక‌పోయినా మ‌న్మ‌ధుడు 2 చిత్రానికి ఈ స్దాయి క్రేజు వస్తుందని ఎవరూ ఊహించలేదు. డిజిట‌ల్-శాటిలైట్ డీల్ అంత క్రేజీగా పూర్త‌యింద‌ని చెబుతున్నారు కాబ‌ట్టి ఆ మేర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అదే స్దాయిలో గానే ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతోంది.

రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఫ‌న్ రైడ్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్‌9న విడుద‌ల చేయ‌నున్నారు.