ప్రియాంక నిక్  జోనస్  ఢిల్లీ అందుకే వెళ్లారు

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికన్ నటుడు గాయకుడు నిక్ జోనస్ తో ప్రేమలో పడి వివాహం చేసుకోబోతున్నది  . గతవారం  దీపికా పదుకొనె , రణ్వీర్ సింగ్ వివాహం ఇటలీలో జరిగింది . ఇప్పుడు ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహం గురించి మాట్లాడుకుంటున్నారు . వీరి విహహం డిసెంబర్ 2,3 తేదీల్లో జోద్ పూర్ లో వైభవంగా జరగబోతున్నది . ఇప్పటి నుంచే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి .

డిసెంబర్ 2వ తేదీన హిందూ సాంప్రదాయ పద్దతిలో , 3వ తేదీన క్రిస్టియన్  పద్దతిలో మ్యారేజ్ జరుగుతుంది . ఈ ఇద్దరు ఈ రోజు ఢిల్లీ బయలుదేరారట . ఎందుకని సన్నిహితులు అడిగితే  తమ  గ్రాండ్ వివాహ వేడుకలో  పాల్గొనమని  ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాడానికి  అని  చెప్పారట .

ప్రియాంక కు 36 ఏళ్ళు  నిక్ కు 25 ఏళ్ళు .. వీరి ప్రేమకు వయసు అడ్డు రాలేదు . మహా ఉత్సాహంగా  ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు . అంతా బాగానే వుంది ప్రధాని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి జోద్పూర్ వెడతాడా ?